Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

ధ‌న త్ర‌యోద‌శి

 

ధ‌న త్ర‌యోద‌శి 


        ధ‌న త్ర‌యోద‌శి సంద‌ర్భంగా ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం కాశీ క్షేత్రంలో కొలువై ఉన్న జ‌గ‌న్మాత బంగారు అన్న‌పూర్ణాదేవి ద‌ర్శ‌నం. అమ్మ‌వారు భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్న నేప‌ధ్యంలో ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌స్తున్న భ‌క్తుల‌తో కాశీ క్షేత్రం సంద‌డిగా మారింది.

         బంగారు అన్న‌పూర్ణ‌గా అమ్మ‌వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చే ఈ ఐదు రోజులూ అమ్మ‌వారి ప్ర‌సాదంగా ధాన్యం, రూపాయి కాయిన్ భ‌క్తుల‌కు ప్ర‌సాదంగా అంద‌జేయ‌నున్న‌ట్లు అన్న‌పూర్ణ ఆల‌యం మ‌హంత్ శంక‌ర పురి తెలిపారు.కార్య‌క్ర‌మం ముగింపు రోజైన 5వ తేదీ శుక్ర‌వారంనాడు బంగారు అన్న‌పూర్ణ మందిరంలో అన్న‌కూటం కార్య‌క్ర‌మంలో భాగంగా 501 కేజీల బ‌రువు తూగే విధంగా 56 ర‌కాల పిండివంట‌లు, 108 ర‌కాల మిఠాయిల‌ను జ‌గ‌న్మాత బంగారు అన్న‌పూర్ణ‌కు ప్ర‌సాదంగా నివేదిస్తారు. 

అలాగే నిత్యం వివిధ ర‌కాల పండ్లు, కూర‌గాయ‌ల‌తో ఆల‌యాన్ని అత్యంత శోభాయ‌మానంగా అలంక‌రిస్తారు. అమ్మ‌వారికి నివేదించిన పిండివంట‌లు, కూర‌గాయ‌లు, పండ్లు ప్ర‌సాదాల‌ను ప్ర‌తిరోజూ సాయంత్రం సాయంత్రం భ‌క్తుల‌కు పంపిణీ చేస్తారు.


శ్రీమాత్రే నమః  

        ఆయుర్వేద  విజ్ఞానానికి ధన్వంతరి  ఆరాధ్య దైవం.క్షీరసాగరమధనం  సమయంలో శ్రీమహా విష్ణువు  యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ  త్రయోదశిని    హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.
వ్రత విధానం  ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నదీ స్నానం కాని లేదా సముద్ర స్నానం కాని ఆచరించాలి. గృహంలో కాని, నదీ లేదా సముద్ర తీరాలలో కాని, వైద్యశాలలో కాని తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరికి ఆవాహన చెయ్యాలి.ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యధాశక్తి షోడశోపచార సహితంగా పురుషసూక్త విధానంతో అర్చన జరపాలి. మత్స్యపురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠించి, గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి సార్థవ్రత కథను పారాయణ చేయాలి. వ్రత సమాప్త్యానంతరం ఇతర వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి, ఘృతయుక్తమైన పెసర పులగం నివేదన చేసి భుజించాలి.ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం జీవిస్తారు. 



Post a Comment

0 Comments