Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

రిలయెన్స్ కు చుక్కలు

 రిలయెన్స్ కు చుక్కలు చూపిస్తున్న వివేక్ రే..

        రిలయెన్స్ ఎన్ని తప్పులు  చేస్తున్నా చర్యలు తీసుకోవడానికి మంత్రులు, అధికారులు జంకుతుంటారు.  అంతులేని ధనం తో విర్రవీగుతున్న రిలయెన్స్ కు ఓ అధికారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.  కంటి చూపుతో అధికారులను శాసిస్తున్న అంబానీకి గుడ్లు పీకుతానంటూ నోటీస్ ఇచ్చాడో అధికారి.  ఫైన్ కట్టకపోతే కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పాడు. ఒప్పందాన్ని తుంగలో తొక్కి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న రిలయెన్స్ కు ఓ అధికారి ఫైన్ వేశాడు..

        కోట్ల మంది ప్రజలకవసరమైన విద్యుత్ ను తన లాభాలకు లంకె పెట్టుకుని రిలయెన్స్ ఆట ఆడుతోంది.అసలు ప్రభుత్వం ఏంటో ఒప్పందాల విలువ ఏంటో..చట్టం ఎలా పనిచేస్తుందో.. అంబానీలకు తెలియచెబుతున్నాడు.అతనే ఆయిల్ శాఖ సెక్రటరీ వివేక్ రే.. దాదాపు 7వేల కోట్ల రూపాయలు ఫైన్ కట్టాల్సిందేననితేల్చి చెప్పాడు

.        2012-13లో రోజుకు యావరేజ్‌గా 86.73 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్స్ తీయాల్సి ఉంటే రిలయెన్స్ అందించింది కేవలం 26.07 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్స్.  2012-13 నాటికి రిలయెన్స్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సింది రు.798 కోట్లు ఇప్పటికే రిలయెన్స్‌రూ.721 కోట్లు చెల్లించింది.

        కృష్ణా గోదావరి బేసిన్‌ నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ ను రిలయెన్స్ తన లాబీయింగ్‌తో.. మాయోపాయంతో దక్కించుకుంది.  అంబానీలకు సలాములు చేసే అధికారగణాలు అన్నీ అనుకూలంగా చేసి పెట్టారు. ఒప్పందం ప్రకారం అందించాల్సిన గ్యాస్‌ను తీయడంలో రిలయెన్స్ నాటకం ఆడింది.  రేటు సరిపోదని పెంచాలని ప్రభుత్వానికి కాగితాలు పంపి.. వత్తిడి చేసింది. అది తేలేవరకు కావాలనేప్రొడక్షన్‌ లేటు చేసింది. దీని వలన కోట్లాది భారతీయులు నష్టపోయారు.

        రిలయెన్స్ మాట విననందుకు పెట్రోలియం శాఖా మంత్రే మారిపోయారు.ఇక రిలయెన్స్ తరపున ప్రభుత్వ రంగస్ధలంపై కేంద్ర మంత్రుల వేషాలు మొదలయ్యాయి.  పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి డాలర్లు పెట్టాల్సి వస్తోందని... అందుకే రూపాయి పడిపోతుందని... మన దేశంలో ఉన్నదాన్ని వాడుకోవాలంటే రిలయెన్స్ కు రేటు పెంచాలని.. వింత వాదాన్ని వినిపించారు.

        చివరికి కోరిక తీర్చారు. రేటు పెంచారు. ప్రజలకు విద్యుత్, గ్యాస్‌ రేట్లు పెరుగుతాయని ప్రతిపక్షాలు మొత్తుకున్నా వినలేదు. ఇప్పటికే ఇవ్వాల్సిన ఉత్పత్తి అందించని రిలయెన్స్ ను మాత్రం ఎవరూ ఏమీ అనలేదు  రిలయెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మాత్రం భారీగా ఏర్పాటు చేసింది. ఆ ఖర్చంతా వెనక్కు తీసుకున్నాకే.. ప్రభుత్వానికి వాటా దక్కుతుంది.  ఖర్చంతా ప్రభుత్వం కూడా భరిస్తున్నప్పుడు... రిలయెన్స్ నష్టపరిహారం ఎందుకు కట్టదనే అంశాన్ని ఒప్పంద పత్రాల నుంచి వివేక్‌ వెలికి తీశారు.

        కేంద్ర మంత్రులు లొంగిపోయినా... ఆయిల్‌ శాఖ సెక్రటరీ వివేక్‌ రే మాత్రం  వదిలి పెట్టలేదు. రిలయెన్స్ 7 వేల కోట్ల డాలర్ల ఫైన్‌ చెల్లించాలని నోటీస్‌ ఇచ్చారు.  దీని మీద కోర్టుకు వెళ్లడానికి రిలయెన్స్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి కామన్‌ ఆర్బిట్రేటర్స్‌గా ఇద్దరు జడ్జిలను నియమించే ప్రాసెస్‌ నడుస్తోంది.

        దీనికి మళ్లీ కేంద్ర మంత్రుల సహాయ సహకారాలు అందుతున్నాయి. కాకపోతే రూల్స్ దెబ్బకు ఏమీ చేయలేక గింజుకుంటున్నారు.  ప్రభుత్వాలనే ఆటాడిస్తున్న రిలయెన్స్‌ రెక్కలు విరుస్తున్న వివేక్‌కు ఏ మాత్రం మద్దతు లభిస్తుందో చెప్పడం కష్టం.

        కేంద్ర మంత్రులే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాక... ఫైన్‌ వసూలు ఎంత వరకు సాధ్యమో చెప్పలేం.  అయితే తన బాధ్యతను సాహసోపేతంగా నిర్వహించిన వివేక్‌ రేకు ప్రజల మద్దతు మాత్రం లభిస్తుందని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి  దీనిని అందరూ షేర్ చేసి మద్దతు తెలియ చేస్తారని ఆశిస్తున్నాను

Post a Comment

0 Comments