Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

సరస్వతి దేవి ఆలయాలు


సరస్వతి దేవి ఆలయాలు
(సేకరణ)

⑴ సరస్వతి దేవి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. కాశ్మీర్ బాసరా (తెలంగాణ)..
⑵ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో... పుష్కర్ (రాజస్థాన్).. ధర్మపురి (తెలంగాణ)
⑶ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో.. అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్) కాలేశ్వరం (తెలంగాణ)
⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు.. నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్) గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)



ధర్మపురి:-
యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే.. (మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా)బ్రహ్మదేవుడు (సృష్టి)నరసింహుడు, (స్థితి)శివుడు, (లయం)యముడు, (కాలం)
అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది

కాళేశ్వరం:- ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే.. వేములవాడ:- అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన) మెదక్:- సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది.. యాదగిరి:- అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం.. కొండగట్టు:- శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం.. బాసర (వ్యాసపురి):- వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం.. భద్రాచలం:- శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం. చెన్నూర్:- గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం. మంథని:- మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహా ముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే. బోదన్: బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించ డానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే.
మన ఘన కీర్తి గల తెలుగు నేల మనదైనందుకు తెలుగు వారిగా గర్వ పడదాం

Post a Comment

0 Comments