click for more 👇
బ్రాహ్మణుని విలువ:
ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది. ఫిర్యాదుదారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు ఒక బ్రాహ్మణుడు సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి ఆదాయపు పన్ను కూడా చెల్లించడం లేదు, కావున తమరు విచారణ జరిపి అక్రమ సంపాదనాపరుడిగా గుర్తించి తగిన విధంగా శిక్షించగలరని ఫిర్యాదు.
అప్పుడు జడ్జి గారు బ్రాహ్మణుణ్ణి పిలిచి ఈ విధంగా ప్రశ్నించారు. మీరు మీ వద్ద ఉన్న ధనం అక్రమంగా సంపాదించారా లేక సక్రమంగా సంపాదించారా అని.దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు నేను సంపాదించినదంతయు సక్రమమే ఇసుమంతయు అక్రమం కాదు అని.అంతలో జడ్జి అంత సంపాదన సక్రమంగా ఎలా సంపాదించావో వివరించమని అడిగారు.
అప్పుడు బ్రాహ్మణుడు అయ్యా!ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు వద్దకు వచ్చారు, నేను ఆ సమయంలో సంధ్యావందనం చేస్తున్నాను. ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను. ఆత్మ హత్య మహా పాపం అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింప చేసి స్వాంతన కలిగించాను. నా మాటపై విశ్వాసంతో వారు వెనుదిరిగి వెళ్లారు. కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్నా వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని వేడుకున్నారు.
దానికి ప్రతిఫలంగా సంతాన సిద్ధిరస్తు.. అని ఆశీర్వాదం ఇచ్చాను. కొన్ని సంవత్సరాల తరువాత వారికి కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నావద్దకు వచ్చి, మా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి అని ప్రాధేయపడ్డారు. దానికి నేను ఆ పిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు, నీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ సమయంలో ఆనందంతో మరికొంత ధనం ఇచ్చి వెళ్ళాడు.మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే ఆ ధనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడయ్యాడనే విషయం తెలియజేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు.
నేను ఆ దంపతులిద్దరిని "ఆయురారోగ్య వృద్ధిరస్తు" అని ఆశీర్వదించాను. అతను తన వద్ద ఉన్న ధనంలో కొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.
అయ్యా!ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాదించింది, సక్రమమైనదో లేక అక్రమమైనదో తమరే తీర్పు ఇవ్వండి అని సెలవిచ్చారు.
పై విషయం అంతా సావధానంగా విన్న జడ్జి తీర్పు ఇచ్చాడు. ఆరోజున ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆ దంపతులను ఈ బ్రాహ్మణుడు వారించకుండా ఉంటే వారికి తర్వాత జీవనం ఉండేది కాదు. కొన్ని రోజులకు వారు తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞతాపూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోదయోగ్యమైనది, ఆ ధనం సక్రమమైనదే
కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చారు, అదియునూ, సక్రమమైనదే.
మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడయ్యాడనే సంతోషం తో కొంత ధనం ఇచ్చారు. ఈ విషయంలో ఎక్కడా బ్రాహ్మణుని సంపాదన అక్రమమని తెలుపలేము, అని తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంలోనే జడ్జి గారు ఇలా అడిగాడు.
అయ్యా ఇంత ధనాన్ని మీకిచ్చి పుణ్యాత్ములైన ధనవంతులు ఎవరో తెలుకోవాలనే ఉత్సుకతతో ఉన్నాను, ఎవరో తెలుపగలరా? అని.అప్పుడు ఆ బ్రాహ్మణుడు మాట్లాడుతూ ఆ పుణ్యదంపతులు మీ తల్లిదండ్రులే అని తెలియచేసినాడు.ఆనందభాష్పలతో తను కూర్చున్న స్థానం నుంచి దిగి వచ్చి బ్రాహ్మణునికి సాష్టాంగ నమస్కారం చేశారు ఆ జడ్జిగారు.
గో బ్రాహ్మణేభ్య: శుభం భవతు!
సంతోష్ పరశురామ శర్మ పోస్ట్ కొద్ది మార్పులతో.


0 Comments