ఏపీకి భారీ వర్ష సూచన చేసింది
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం అరేబియా సముద్రం లో అల్పపీడనం ఏర్పడింది.
ఈనెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది అని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించారు. క్రమేపీ అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తా ఆంధ్రలోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 11 ,12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది మరియు రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నెల 9 ,10 తేదీల్లో తమిళనాడులోనూ.. 10 ,11 ,12 తేదీలలో దక్షిణ కోస్తా ఆంధ్రాలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9 లోపు తీర ప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది.
0 Comments